ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీ ఫైనల్ కు చేరుకుని, క్రీడాభిమానుల హృదయాలను ఉత్కంఠతో నింపింది. ఈ (నేడు) ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థులుగా భారత్ ,పాకిస్థాన్ తలపడనున్నారు. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు ఎదురై ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్ల్లోనూ భారత జట్టు పాకిస్థాన్పై విజయం సాధించడంతో, ఆత్మవిశ్వాసంతో, ఆట ప్రతిభతో భారత్ ఫైనల్లో కొనసాగింది. ఈ మ్యాచ్లను మొబైల్స్లో ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది.
ముఖ్యం జియో యూజర్లు.. ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్తో సోనీ లివ్ యాప్ (Sony Liv App) ను ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

