
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం దేశపు తొలి ఏఐ సర్వర్ను ప్రదర్శించారు. మానేసర్లోని వీవీడీఎన్ టెక్నాలజీస్కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పార్క్లో ఆయన మాట్లాడుతూ… ఇందులో 8 జీపీయూలు ఉన్నాయన్నారు. అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధలో మన దేశం మంచి పురోగతి సాధిస్తున్నదని మంత్రి చెప్పారు. వీవీడీఎన్ టెక్నాలజీస్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.