
పాక్ ప్రధాని షెహబాజ్ ఒప్పుకోలు:
ఇటీవలి ఆపరేషన్ సిందూర లో భాగంగా తమ దేశం భారతదేశపు క్షిపణుల దాడిలో తమ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ అంగీకరించింది. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారిగా శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్ క్షిపణుల దెబ్బ భరించాల్సి వచ్చిందని, తమ దేశ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ఆయన తెలిపారు. .