
బెట్టింగ్ యాప్స్తో తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక విధ్వంసం, బాధితుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఎం రమేశ్ నేతృత్వంలోని ఈ బృందంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, సైబరాబాద్ అదనపు ఎస్పీ చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ శంకర్ను నియమించారు. ఈ కేసులను సిట్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం అధ్యయనం జరిపి 90 రోజుల్లో డీజీపీకి నివేదిక సమర్పించనున్నది.