
RCB విజయోత్సవ పరేడ్ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన చర్యలు తీసుకున్నారు. “కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ACP, సెంట్రల్ డివిజన్ DCP, క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్, అదనపు పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనర్లను తక్షణమే సస్పెండ్ చేశాం.” అని, RCB ప్రతినిధి, KCSA ప్రతినిధిని వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర DG, IGP లకు ఆదేశించారు.