“భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త మిషన్ను చేపట్టింది. అదే ‘దొంగ ఓట్ల’ మిషన్. రాష్ట్రంలో ఓటర్ల సవరణ సాకుతో 2.89 కోట్ల ఓట్లు జాబితా నుంచి తొలగిపోవడంతో, ఆ ఖాళీని తమకు అనుకూలమైన బోగస్ ఓట్లతో నింపాలని ఆ పార్టీ చూస్తోంది” అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల సంఖ్యను పెంచాలంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన మండిపడ్డారు.

