కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కనుందనే ఉత్కంఠకు తెర పడింది. కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కమలదళం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్గా అదే పార్టీకి చెందిన సునీల్రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యూహత్మకంగా వ్యవహరించారు. మేయర్ పదవికి పోటీ పడ్డ కాంగ్రెస్ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి.

