నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిసి హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న అనుముల మండలం, హజారి గూడెం గ్రామానికి చెందిన ఎర్రబోయిన హిమశ్రీ (19) అనే విద్యార్థిని సోమవారం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. తెల్లవారుజామున హాస్టల్ ఆవరణలో ఉన్న బాత్రూంలు కడిగే యాసిడ్ను సేవించి రూమ్ లోకి వచ్చి వాంతులు చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థినులు చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

