వార్షిక బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది.ఈ నేపథ్యంలో సాంప్రదాయ హల్వా వేడుక నేడు, జనవరి 27న ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగింది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హల్వా వేడుక తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్ల తయారీలో నేరుగా పాల్గొన్న అధికారులంతా లాక్-ఇన్ పీరియడ్లోకి వెళతారు. ఈ కాలంలో దాదాపు 60 నుంచి 70 మంది అధికారులు, ఉద్యోగులకి బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు ఉండవు. వారు ఇంటికి కూడా వెళ్లలేరు.

