ఫిలిప్పీన్స్లో కల్మేగీ తుపాను బీభత్సం ఇంకా కొనసాగుతోంది. తుపాను కారణంగా సెంట్రల్ ప్రావిన్స్లో దాదాపు 114మంది మృతిచెందగా, 127 మంది వరదల్లో గల్లంతైనట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. విపత్తుదళ అధికారులతో జరిగిన సమావేశంలో మార్కోస్ తుపాను పరిణామాల గురించి ప్రధానంగా చర్చించారు. అనంతరం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్లో కల్మేగీ తుపాను దాటికి భారీ వరద పోటెత్తిందని,
పలువురు ఇళ్లలోనే చిక్కుకోగా, డజన్లకొద్దీ కార్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

