
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటలో పట్టపగలు సత్తారు గోపి(46)అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో ప్రత్యర్ధులు నరికి చంపారు. వైసీపీ నేత,ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రధాన అనుచరుడిగా గోపి ఉన్నారు. సరిగ్గా ఏడాది కిందట గోపి డ్రైవర్ కూన ప్రసాద్ ను గ్రామంలోనే ప్రత్యర్థులు హత్య చేశారు. ఇప్పుడు సత్తారు గోపీనే హత్య చేశారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిసీలించారు. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయి అంటూ ఎస్పీనీ గ్రామస్తులు నిలదీశారు.