రేపు దేశ వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ జరగబోతున్న నేపథ్యంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యంగా పరీక్ష రాయాలని, ఏం జరిగినా మీతో ఉంటామని, మిమ్మల్ని రక్షించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈ సారైనా తప్పులు లేకుండా పరీక్ష జరిగేలా చూడండి. ఇప్పటివరకు విద్యార్థులు అనుభవించిన తీవ్రమైన ఒత్తిడి చాలు. మళ్లీ మనో వేదన చెందడానికి సిద్ధంగా లేరు. ఏ ఒక్కరి కల కూడా చెదిరిపోవడానికి వీల్లేదు’ అని కోరారు.

