‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. చలానాలు వేయకుండానే నియంత్రణ చర్యలు చేపట్టాలి. చలానా మొత్తం వాహన యజమాని నుంచి వసూలు చేసేలా చూడాలి. తప్పని పరిస్థితుల్లో చలానా వేయాలి.. డిస్కౌంట్లు ఇవ్వాలి. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కూడా కేసులు పెట్టాలి. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వం అజెండాగా తీసుకోబోతోంది’’ అని అన్నారు.

