
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సిఎం రేవంత్.. ఈ సమావేశం తర్వాత ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని సిఎం రేవంత్ రెడ్డి.. ప్రధానిని కోరినట్లు సమాచారం.