
నిందితుల అరెస్టు సమయంలో పోలీసుల తీరు, నిబంధనల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు నిబంధనలను పాటించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) చెందిన డీజీపీలకు హెచ్చరికతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.