తెలుగుజాతి గుర్తింపు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టిశ్రీరాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు తెలియాలన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన తర్వాత తెలుగుజాతి గుర్తింపు కోసం పోరాడిన మహనీయులని కొనియడారు. 2026 మార్చి 16 పొట్టిశ్రీరాములు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

