రైతుల పాలిట ప్రాణాంతకంగా మారిన ‘పారాక్వాట్’ (Paraquat) గడ్డి మందును తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. బీఆర్ఎస్ బోయినపల్లి వినోద్ కుమార్, ఇటీవల సినీ నటుడు రాహుల్ రామకృష్ణ పారాక్వాట్ దుష్పరిణామాలపై గళమెత్తిన నేపథ్యంలో.. రైతుల ప్రాణాలు బలిగొంటున్న ఈ గడ్డిమందును నిషేధిస్తూ సోమవారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ తీర్మానం చేసింది. తద్వారా ఈ హానికర రసాయనం నుండి రాష్ట్రంలోని రైతాంగానికి ఉపశమనం లభించనుంది.

