
పాకిస్థాన్ మనపై చేస్తున్న దాడులపై ప్రతిదాడిగా పాక్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. పాకిస్థాన్లోని చక్లాలా, మురిద్, రహిమ్యార్ ఖాన్, రఫీకి ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ మన ఎయిర్ బేస్లపై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసుకుంటున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని అని అన్నారు. పాక్ ప్రచార ఫేక్ అని కొన్ని ఫొటోలు కూడా చూపించారు.