పొట్టి క్రికెట్లో సంచలన ఆటకు కేరాఫ్గా మారిన అభిషేక్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. నాగ్పూర్లో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వేగవంతమైన అర్ధ శతకం సాధించాడు. సిక్సర్లు, హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో అతడికిది ఏడో యాభై కావడం విశేషం. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 8వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా తొలి మూడు బంతుల్ని బౌండరీ లైన్ దాటించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

