
‘టీచర్ల బాగోగులు చూసుకునే బాధ్యత నాది… విద్యార్థుల బాధ్యత టీచర్లది.. భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘నాకంటే వేరే రాష్ట్రం మెరుగ్గా ఉంటే నేను తట్టుకోలేను. ఎప్పుడూ రాష్ట్రాన్ని నెంబర్-1గా ఉండాలనే కోరుకుంటున్నాను. విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేశారు.‘పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా చదివిస్తే ఊహించనంత ఎత్తుకు ఎదుగుతారు, అని సీఎం చంద్రబాబు అన్నారు.