
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. ముందుగా రిజర్వేషన్ చేసుకోకుండా.. ఇప్పుడు తిరుమల ప్లాన్ చేసుకునే భక్తులు.. ఒక రెండు, మూడు రోజులు ఆగితే మంచిది అని సూచించింది. కారణం ప్రస్తుతం తిరుమలలో ఉన్న రద్దీ. దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది టీటీడీ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. తిరుమల రావాలనుకునే భక్తులు.. ఒక 2,3 రోజులు ఆగి ఆతర్వాత వస్తే బాగుటుందని తెలిపింది.