కరూర్ తొక్కిసలాట ఘటనలో హీరో, టివికె అధినేత విజయ్ను సిబిఐ రెండోసారి విచారించింది. సోమవారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్ను అధికారులు దాదాపు 6 గంటలపాటు విజయ్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నెల 12నే ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్ను సిబిఐ ఆరు గంటలకుపైగా ప్రశ్నించింది. ఈరోజు రెండోసారి విచారణ సందర్భంగా విజయ్ ను అనుమానుతుడిగా ప్రశ్నించిట్లు తెలుస్తోంది.

