
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు అధికార భాషగా ఉన్న రాష్ట్రంలోనే తెలుగు భాషకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించినవారు నలభై ఏండ్లలోపు వారే ఉన్నారని ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలలో నిజమెంత అనే అంశాలను టీజీపీఎస్సీ తేటతెల్లం చేయాలి.