తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మూడు నెలల్లోపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ… ఆయన ఎటువంటి చర్యు తీసుకోలేదని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ పిటిషన్పై ఈ నెల 17న విచారణ జరిగే అవకాశం ఉంది.

