తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా ఊడిపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఏం కాలేదు. ప్రమాదం నుంచి బయటపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

