
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. టెట్ పరీక్షలను 9 రోజుల్లో 16 సెషన్స్ల్లో జరుగుతాయని,
మెదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.