
తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీలోగా ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14వ తేదీలోగా ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు,రూ. 200తో డిసెంబర్ 2 నుంచి 11 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.