
తిరుమలలో అన్యమతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన ఘటన మరువకముందే మరో అపచారం జరిగింది. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు మద్యం సేవించి తిరుమల కొండపైకి చేరుకోవటమే కాకుండా.. వాహనం నడుపుతూ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. తిరుమలలోని గోపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తమ వాహనంలో కొండపైకి వచ్చిన ముగ్గురు పోలీసులు తమ వాహనాన్ని కర్ణాటకకు చెందిన భక్తుల వాహనంతో ఢీకొట్టారు.