
తల్లికి వందనం పథకం అమలుకు గురువారం శ్రీకారం చుట్టింది. నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. సోమవారం వరకు కూడా డబ్బులు జమ కాకపోతే… జూన్ 26 వరకు వారికి సమయం ఇస్తున్నాం. మనమిత్ర వాట్సప్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయవచ్చు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియచేస్తే… వాటిని పరిశీలించి అర్హులుగా గుర్తించి, తల్లికి వందనం డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.