
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని ,
కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్షా విఫలమయ్యారని అన్నారు. అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో చొరబాట్లకు బీఎస్ఎఫ్ కారణమని ఆరోపించారు మహువా మొయిత్రా.. కాగా..తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.