ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేపై వాహనాలు అత్యంత వేగంతో వెళ్తున్న తరుణంలో ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ గందరగోళం మొదలైంది. వెనుక వస్తున్న వాహనాలు నియంత్రణ కోల్పోయి ఒకదాని తర్వాత ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ధాటికి ఐదు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇంజన్ల నుంచి పొగలు రావడం, వాహనాల శకలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా, భారీ రోడ్డు ప్రమాదం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

