ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు, ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. తాము బాధ్యతాయుతంగా ఈ ఏఐ పరిజ్ఞానం వినియోగిస్తాం, దుర్వినియోగపర్చబోం అని ప్రతిన వహిస్తూ2,50,946 మంది యువజనం ప్రకటించారు. ఇది గిన్నిస్ రికార్డుల్లో చేరిందని రికార్డు నిర్వాహకులు ప్రవీణ్ పటేల్ బుధవారం తెలిపారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ భారీ సంఖ్యలో జనం ప్రతిజ్ఞ తీసుకున్నారు.

