దేశ రాజధాని ఢిల్లీలోని టిగ్రి ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మొదట సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లోని చెప్పుల షూ షాపులో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించి, మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి.మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ప్రమాద స్థలంలో కాలిపోయిన మూడు మృతదేహాలను గుర్తించి.. బయటకు తీసుకొచ్చారు.

