దేశ గిరిజన కళా సంపదకు జాతీయ వేదికగా నిలిచే గిరిజన కళా మహోత్సవం–2026ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం ప్రారంభించారు. ట్రావన్కోర్ ప్యాలెస్లో జరుగుతున్న ఈ 12 రోజుల ఉత్సవం మార్చి 3 నుంచి 13 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 30కు పైగా గిరిజన కళారూపాలు, 75 మంది కళాకారులు, వెయ్యికి పైగా కళాఖండాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. గిరిజన దృశ్యకళా సంపదను సమగ్రంగా ఆవిష్కరించే అరుదైన అవకాశమిది.

