దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేసింది. మొంథా ప్రభావంతో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. ట్రాక్పై నుంచి నీరు పారుతుండడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. మరో రైలును రీషెడ్యూల్ చేసింది.

