
ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బందిపడుతూనే వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. నిన్న కూడా ఆయన జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు, అధికారులతో సమీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇలా విరామం లేకుండా పనిచేయడంతో రాత్రికి జ్వరం తీవ్రత పెరిగినట్లు సమాచారం. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి వైరల్ ఫీవర్ గా నిర్దారించారు.