విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పదవులు అమ్ముకుంటూ అవినీతి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో పార్టీ పదవులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో లీడర్లు తిరిగే వాళ్లని ఇప్పుడు ఎంపీ కార్యాలయంలోనే కూర్చొని పదవులు డబ్బులు ఇచ్చే వాళ్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రేషన్ మాఫియా, ఇసుకు మాఫియా నడుపుతూ పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని అన్నారు. ఎంపీ కార్యాలయంలోని మూల్పూరి కిశోర్ చేస్తున్న దందాతో పార్టీ నేతలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

