
పాకిస్థాన్కు టర్కీ మద్దతు నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీ సెలెబ్ ఏవియేషన్ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సెలెబ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా, ఈ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పశ్చాత్తాపం కంటే జాగ్రత్తగా ఉండటం ఉత్తమం’ అని జస్టిస్ సచిన్ దత్తా వ్యాఖ్యానించారు.