పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారుచేస్తున్నది. మసూద్ అజార్ సోదరి
సాదియా అజార్ నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ను తయారుచేస్తున్నది. ఇందులో భాగంగానే మహిళలకు తాజాగా ఆన్లైన్ జిహాదీ కోర్సులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

