
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు, వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 3 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేసిన విషయం తెలిపారు. జీవో 3 పునరుద్ధరణకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు, అడ్డంకులపై అధికారులతో సీఎం చర్చించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు, వారిని మళ్లీ ఆ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- 0 Comments
- AlluriSitaramaraju District