జమ్మూకాశ్మీర్లో మరోసారి డ్రోన్ల కలకలం రేగింది. నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్పై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో మరిన్ని డ్రోన్లను గుర్తించినట్లు భారత భద్రతా బలగాలు ధృవీకరించాయి. డ్రోన్లు తుపాకులు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచాయా? అని తనిఖీ చేయడానికి సైన్యం ఆ ప్రాంతంలో పరిశీలిస్తోంది. శనివారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుండి వచ్చిన డ్రోన్ సాంబా సెక్టార్లో
ఆయుధాల సముదాయాన్ని జారవిడిచింది. మెషిన్ గన్లు డ్రోన్లను లక్ష్యంగా చేసుకున్నాయని భారత సైన్యం తెలిపింది.

