మేడారం మహాజాతర నాలుగో రోజు ముగిసింది. శనివారం గద్దెల వద్ద పూజల అనంతరం రాత్రి వనదేతవలు వన ప్రవేశం చేశారు. డప్పు, డోలు వాయిద్యాలతో పూజారులు వనదేవతలను గద్దెల నుంచి కన్నెపల్లి, చిలకలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. చిలుకలగుట్టకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మను, పూనుగుండ్లకు (మహబూబాబాద్) పగిడిద్దరాజు తరలించారు. గద్దెల పరిసరాల్లో విద్యుత్ దీపాలు నిలిపివేసి పూజారులు వన ప్రవేశం చేయించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

