
పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో వర్మ వెల్లడించిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. మల్లి వారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించిన వర్మ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోందని పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలని అన్నారు. రమణక్కపేటలో ఇసుక అక్రమ రవాణాకు శంకుస్థాపన చేశారని వర్మ కామెంట్ చేశారు. వర్మ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.