
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 10 రోజుల పాటు ఎలాంటి పర్యటనలు చేయొద్దని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరూ రావొద్దని….ఫోన్లోనే సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.