విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిస్ సమ్మిట్తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. గతంలో 2014-19 మధ్యలో ఇలాగే మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు నమ్మించారని గుర్తుచేశారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారని విమర్శించారు. లులు చైర్మన్ చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఏ సదస్సు జరిగినా లులు అధినేత కనిపిస్తారని తెలిపారు.

