కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం బస్సు బైక్ను ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని శివశంకర్గా పోలీసులు గుర్తించారు. ఇతడు కర్నూలు మండలం ప్రజానగర్కు చెందిన వ్యక్తి అని తెలిపారు. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ డోన్ నుంచి తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 9:30కి శివశంకర్.. ఫ్యామిలీతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకే ఇంటికి వచ్చేవాడని.. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని అన్నారు.

