సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ను ఉపయోగించి కొందరు అశ్లీల కంటెంట్ను సృష్టించారంటూ కేంద్రం సదరు కంటెంట్ను వెంటనే తొలగించాలని సంబంధిత మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన ‘ఎక్స్’.. సుమారు 600 అకౌంట్లను వెంటనే డిలీట్ చేసింది. అలాగే ఆ కంటెంట్తో సంబంధమున్న సుమారు 3,500 పోస్టులను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ప్లాట్ఫామ్లో అశ్లీల కంటెంట్ను అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ‘ఎక్స్’ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

