ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలను తేల్చే విషయంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హాయ్ ల్యాండ్లో జవాబు పత్రాలు మూల్యాంకనం జరిగిందా? ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారా? లేదా అనే విషయంపై అసలు వాస్తవాలు నిర్ధారించాలని ఈ కమిటీకి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

