గుజరాత్లో కాలం చెల్లిన పిండితో చేసిన దోసెలు కారణంగానే అక్కాచెల్లెలు చనిపోయారని అనుకున్నారు. కానీ ఇంట్లో దొరికిన ఆధారాలు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుల తల్లిదండ్రుల రక్త నమూనాల్లో అల్యూమినియం పాస్పేట్ , జింక్ ఎక్కువ మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. ఈ సెర్చ్ లో భాగంగానే అల్యూమినియం ఫాస్పైడ్ పురుగుల మందు ప్యాకెట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దోసె పిండి చుట్టుపక్కల వారిలో చాలా మంది వాడారు. వారంతా క్షేమంగా ఉన్నారు. కేవలం ఈ కుటుంబంలోని నలుగురికి ఇలా జరిగింది.

