గుజరాత్లో బిజెపి ప్రభుత్వ హయాంలో దళితుల అణచివేత ఎక్కువ అయిందని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి సంకుచితవాదంతో విద్వేషకర వాతావరణం నెలకొంది. దళితులు, ఆదివాసీ వర్గాలపై దాడులు , వారిపట్ల వివక్ష పెరుగుతోందని అన్నారు. గుజరాత్కు చెందిన దళితులు, ఆదివాసీలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు , వారి సాధకబాధకాలు తెలిసివచ్చాయని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వారి సాధకబాధకాలను తెలియచేయాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.

